సర్కారీ బడుల్లో స్పోకెన్ ఇంగ్లిష్
Spoken English in GOVT School |Telugu news

Spoken English in GOVT School |Telugu news జిల్లాలో తొలివిడతగా 16 పాఠశాలల్లో ఆంగ్ల బోధన » రెండో దశలో 18 పాఠశాలల్లో.. » పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం ఖమ్మం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యా ర్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా… ‘స్పోకెన్ ఇంగ్లీష్’ తరగతులు నిర్వ హించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికా రులు నిర్ణయించారు. సర్కారీ బడుల్లో ఇంగ్లిష్ శిక్షణలో కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండడంతో.. విద్యా ర్థులు కేవలం పరీక్షల్లో రాయడానికి అవసరమైనంత మాత్రమే నేర్చుకుంటున్నారు. దీనివల్ల భాషపై వారికి పట్టు లేకుండా పోతోంది. ఉన్నత చదువులకు వెళ్లిన ప్పుడు వారికి అది అడ్డంకిగా మారుతోంది. తమకు తెలిసిన అరకొర English లో మాట్లాడలేక.. భయంతో studies లో వెనకబడిపోతున్నారు.
16 బడుల్లో ఆగస్టు 14 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
అందుకే ఈ పరిస్థి తిని మార్చేందుకు ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారులు నడుం బిగించారు. సిలబస్ లోని సబ్జెక్టులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ నూ ఒక సబ్జెక్టుగా పెట్టి బోధిస్తూ.. పిల్లలు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని మొత్తం 34 ప్రభుత్వ పాఠశాలలకుగాను తొలివిడతగా 16 బడుల్లో ఆగస్టు 14 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ప్రారం భించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు నిత్యం సాయంత్రం పూట 45 నిమిషాలపాటు ఇంగ్లిష్ మాట్లా డడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇందుకు.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ టీవీలను వినియోగిస్తు న్నారు ద్వారా విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడడంలో తర్పీదు ఇస్తున్నారు.
ఇంగ్లిష్ కథలు, సన్నివేశాలు, కార్టూన్ షోలు,
ఈ పాఠాలు చెప్పడం భాగంగా విద్యార్థుల ఆంగ్ల సంభాషణ
కోసం విద్యా శాఖ అధికారులు ‘భారత్ దేఖో’ అనే ఎన్ జీవోతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ప్రతినిధులు పవిత్ర, అస్రా ద్వారా ముందుగా ఇంగ్లిష్ టీచర్లకు.. పిల్లలతో ఇంగ్లిష్ ఎలా మాట్లాడించాలి? వారిలో ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి? అనే అంశాల పై ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు. ఇంగ్లిష్ కథలు, సన్నివేశాలు, కార్టూన్ షోలు, కొన్ని వీడియో లను కూడా ఆ ఎన్టీవో పంపించింది. ఈ శిక్షణతో వి ద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు. గతంలో Teachers ఏదైన ప్రశ్నEnglish లో అడిగినా.. సమాధానం తెలుగులోనే చెప్పే పిల్లలు, ఇప్పుడు English లోనే బదులిస్తున్నారు.

విద్యార్థులు ఆంగ్లంలో చక్కగా మాట్లాడగ లుగుతున్నారు
ఈ శిక్షణ విజయవంత మైన నేపథ్యంలో… రెండో దశలో మిగిలిన 18 పాఠశాల ల్లోనూ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించను న్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) సోమశే ఖర శర్మ తెలిపారు. కలెక్టర్ ముజమ్మిలాఖాన్ చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించడం వల్ల.. విద్యార్థులు ఆంగ్లంలో చక్కగా మాట్లాడగ లుగుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మార్పు చూసి మాకే ఆశ్చర్యం గతంలో తరగతికి సంబంధించిన ఇంగ్లిష్ సబ్జెక్టును మాత్రమే బోధించేవారం. ఆంగ్లంలో మాట్లాడగలిగే నైపుణ్యం పిల్లలకు అంతగా ఉండేది కాదు.
కానీ, ఇప్పుడీ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతు లతో విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లిష్ చర్చలు, ఇంటరాక్షన్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాం. ఈ training తో పిల్లల్లో వస్తున్న మార్పు చూసి మాకే ఆశ్చర్యం వేస్తోంది. ఇంగ్లిష్ టీచర్,
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఇంగ్లిష్ అంటే భయం పోయింది
నాకు నాన్న లేడు. అమ్మ ఇళ్లల్లో పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. ఇన్నాళ్లుగా నాకు ఇంగ్లిష్ అంటే భయంగా ఉండేది. Spoken English తరగతులతో నేను English లో మాట్లాడడం బాగా నేర్చుకున్నా.

ప్రైవేటు పాఠశాలల్లో చదివే కొందరు నా స్నేహి తులు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే వారు గొప్పగా చదు వుతున్నారని భావించేవాడిని.
ఇప్పుడు నేను కూడా మాట్లాడగలగడం ఆనందంగా ఉంది. – ప్రశాంత్, 7వతరగతి విద్యార్థి ఇప్పుడు అందరితో ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నా
నేను మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నా.
ఇక్కడ spoken english ప్రత్యేకంగా చెబుతున్నందున నేను కూడా english లో మాట్లాడగలుగుతున్నా.
ఇంతకుముందు పుస్తకంలో చూసి చదవడం తప్ప సొంతంగా మాట్లాడలేకపో యేదాన్ని.
ఇప్పుడు క్లాసులో తోటి విద్యార్థులతోనే కాదు.. వేదికపైన కూడా నిర్భయంగా ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతున్నా.
join teligram group for latest news click