Indira Gandhi’s 20-point plan to eradicate poverty
పేదరిక నిర్మూలనకే ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకం
|Indira Gandhi’s 20-point plan to eradicate poverty|
- 1. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం.
- 2. ఉత్పత్తికి ప్రేరణ ఇవ్వడం
- 3. మిగులు భూమిని పంపిణీ చేయడం.
- 4. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
- 5. భూమిలేని కార్మికులకు కనీస వేతనాలు అందించడం,
- 6. బందీలో ఉన్న కార్మికులకు పునరా వాసం కల్పించడం.
- 7. ST ,SC తెగల అభివృద్ధికి గృహ వసతి కల్పించడం,
- 8. ప్రతి గ్రామానికి current fesilities కల్పించడం
- 9. Family planing చర్యలు చేపట్టడం.
- 10. చెట్ల పెంపకం చేపట్టి Forest expand పెంచడం.
- 11. ప్రాథమిక విద్యనులలో పేతం చేయడం.
- 12. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం కార్య క్రమాలు చేపట్టడం
- 13. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం
- 14. గ్రామీణ, పట్టణ ప్రజలకు చేయూతను అందించడం,
- 15. నీటిపా రుదల వసతులు కల్పించడం.
- 16. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపే తం చేయడం.
- 17.పారిశ్రామికవిధానాలను సరళీకృతం చేయడం.
- 18. నల్లధనం నియంత్రించడం.
- 19. తాగునీటి సౌకర్యాలు కల్పించడం
- 20. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
- ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలన లో ఉండేది
Indira Gandhi’s 20-point plan to eradicate poverty
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, మళ్ళీ 1980లో ప్రధాన మంత్రిగా పనిచేసి బరన్ లేడీ ఆఫ్ ఇండియా గా పిలువ బడిన ప్రజా నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ. 1917 నవం బర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ, భారత తొలి ప్రధాని జవ హర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. అసలు పేరు ఇందిరా ప్రియ దర్శిని గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానం.
ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలన లో ఉండేది
ఆమె ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో ఆనంద్ భవన్ లో జన్మించింది. తన తాత మోతిలాల్ నెహ్రూ అలహా బాదులో పేరుపొందిన న్యాయవాది. ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలన లో ఉండేది. దేశం ఆర్ధికంగా, సామాజికంగా అల్లకల్లోలంగా ఉండేది. ఇందిరాగాంధీ అలహా బాదులో ప్రాథ మిక విద్యాభ్యాసం అనంతరం, పూణే విశ్వవిద్యా లయం నుండి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులు అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లో చేరి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. జాతీయోద్యమంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ తరచుగా జైలుకు వెళ్లడం వల్ల, తన తల్లికమలా నెహ్రూ ఆరోగ్యం క్షీణించింది. చికిత్స నిమిత్తం వెళ్లిన తర్వాత అక్కడే తల్లి కి తోడుగా ఉంటూ ఒక స్కూల్లో చేరింది.
ఎంత చికిత్స చేసినా తల్లి ఆరోగ్యం కుదుట పడకపోవడం వల్ల తమ 17వ ఏటనే కమలా నెహ్రూ మరణించడం ఇందిరాగాంధీ ఒం టరి అయింది. తల్లి మరణం తర్వాత ఒంటరిగా ఉన్న ఇందిరకు నెహ్రూ మనోధైర్యాన్ని ఇస్తూ నాయకత్వ లక్షణాలు సూరిపో సే వారు.

మహాత్మాగాంధీ సలహా మేరకు 1942 లో ఇందిర , ఫిరోజ్ ల వివాహం జరిగింది
పై చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల యంలో చేర్పించాడు. ఆమె చదువుతున్న రోజుల్లో జర్నలిస్టు అయిన ఫిరోజ్ గాంధీ తో పరిచయం ఏర్పడి వివాహానికి దారి తీసింది. కానీ వారిద్దరి వివాహానికి నెహ్రూ ఇష్టపడలేదు. చివరగా మహాత్మాగాంధీ సలహా మేరకు 1942 లో ఇందిర , ఫిరోజ్ ల వివాహం జరిగింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇందిరాగాంధీ దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర గురించి తన తండ్రికి ఉత్తరాలు రాస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలియజేసేది. స్వాతంత్య్ర పోరా టంలో సైతం పాల్గొంటూ తండ్రికి తగ్గ కూతురు గా ఉద్యమంలో ధైర్యంగా పాల్గొనేది. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో ఉండగానే మగ పిల్లవాడికి జన్మనిచ్చింది.
1943 మే 13న విడుదలైన ఇందిరా తన కుమారుడికి రాహుల్ గాంధీ అని పేరు పెట్టింది.
1959 లో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయింది
ఇందిరాగాంధీ ఎన్నో సంవత్సరాల
పాటు నెహ్రూ వెనుకనే ఉంటూ అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఆమె సేవలకు గుర్తింపుగా 1959 లో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో నెహ్రూ మరణాంతరం, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కేబినెట్ హెూదాలో పనిచేసి అందరి మన్ననలు పొందారు. తర్వాత 1962 జనవరి 24 న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె రికార్డ్ సృష్టించింది. ప్రపంచ నేతలతో మంచి గుర్తింపు పొందుతూ, అందరి దృష్టిని ఆకర్షించేది. సిక్కుల కోరికమేరకు హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల సహకారంతో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినది.

గరీబీ హటావో నినాదంతో నలభై మూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ
కొందరు నేతలు రెండోసారి ప్రధానిగా ఒప్పుకోని సమయంలో “గరీబీ హటావో నినాదంతో నలభై మూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు, 36 వేల మై ళ్లు పర్యటన చేసి ప్రజల దృష్టిలో గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. ఆమె పరిపాలన కాలంలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్థంభింప చేసినప్పుడు, వారిపై చర్యలు తీసుకుంటూ ఉద్యోగాలు తొలగించినప్పుడు వారి ఆగ్రహానికి గురికావడం, వారు కోర్టు ద్వారా మళ్లీ ఉద్యోగాలు పొందడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో, ఓటు ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అందుకే కార్మికులు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభు త్వాలు నిలబడలేదని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్ప వచ్చును. అలాగే 1971 లో అమేథీ లోక్ సభ నియోజకవర్గం నుండి రాజ్ నారాయణ పై గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రతిపక్షాలు కోర్టులో సవాల్ చేసిన క్రమంలో 1975లో అలహాబాద్ కోర్టు ఆమె ఎన్నిక చెల్లదని,6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని కోర్టు తీర్పునిచ్చింది. కానీ దానిపై స్టే ఆర్డర్ తెచ్చుకుంది. కానీ ప్రతి పక్షాలు ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.

aloso read more news
సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!
డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|
భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world
THILAKVARMA is an opportunitygrabber
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
1975 జూన్ 25న రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు
అప్పుడు రాజ్యాం గంలోని 352 ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు. భారతదేశం లో పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేయాలని తమ తండ్రి ఆకాంక్ష మేరకు పేదరిక
నిర్మూలన కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక పరిస్థితిని చక్క పెట్టారు. రాజకీయాల్లో ఆమెకు కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ లు అండగా నిలిచారు. ఆర్థిక దోపిడీని తగ్గించడానికి, సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 1975, జూలైలో 20 సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
అవి… 1. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. 2. ఉత్పత్తికి ప్రేరణ ఇవ్వడం 3. మిగులు భూమిని పంపిణీ చేయడం. 4. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం. 5. భూమిలేని కార్మికులకు కనీస వేతనాలు అందించడం, 6. బందీలో ఉన్న కార్మికులకు పునరా వాసం కల్పించడం. 7. ST ,SC తెగల అభివృద్ధికి గృహ వసతి కల్పించడం, 8. ప్రతి గ్రామానికి current fesilities కల్పించడం 9. Family planing చర్యలు చేపట్టడం. 10. చెట్ల పెంపకం చేపట్టి Forest expand పెంచడం. 11. ప్రాథమిక విద్యనులలో పేతం చేయడం. 12. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం కార్య క్రమాలు చేపట్టడం 13. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం 14. గ్రామీణ, పట్టణ ప్రజలకు చేయూతను అందించడం, 15. నీటిపా రుదల వసతులు కల్పించడం. 16. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపే తం చేయడం. 17.పారిశ్రామికవిధానాలను సరళీకృతం చేయడం. 18. నల్లధనం నియంత్రించడం. 19. తాగునీటి సౌకర్యాలు కల్పించడం 20. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
మొదలైన పథకాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకుని దేశ ప్రజల కోసం స్వపరిపాలన అందించిన గొప్ప నేత, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమెను 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులే ఇందిరాగాంధీని కాల్చి చంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇందిరా గాంధీ పరిపాలన ఆమె ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు గుర్తు చేసు కుంటారు. వారి ఆదర్శవంతమైన పాలనా విధానాలను ప్రస్తుత ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయనడంలో సందేహం లేదు. పరి పాలనలోని కొన్ని అంశాలు ఆచరణీయం ఆదర్శవంతం అని చెప్పవచ్చును. తెలం గాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మి ంచనున్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసు కు వస్తామని పలుమార్లు ముఖ్య మంత్రి, మం త్రులు వివిధ సందర్భాలలో అంటున్నారు.