ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్
భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’

-
భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలా మందికి తెలిసే ఉంటుంది
-
కానీ, ఆ ఆలోచన, ఆ కృషి శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయని ఏ కొద్ది మందికో తెలిసి ఉంటుంది
-
సైన్సు ఫలితాలను వాటికోసం జీవితాలను అర్పించిన వారిని గుర్తుంచుకోవడం మన జనా నికి ఇంకా అలవడ లేదు
-
ఇతర గ్రహాలకు రాకెట్లు పంపుతున్నది మన శాస్త్రవేత్తలే –
-
గ్రహపూజలు చేస్తున్నది కూడా మన జనాలే
భారతీయ సమాజం వైజ్ఞానిక స్పృహతో ఎప్పుడు వ్యవ హరిస్తుందో ఏమో. రష్యా స్పుత్నిక్ ఉపగ్రహం ప్రయోగించగానే, మన భారతదేశం కూడా అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించాలని కలలు గన్నవారు విక్రమ్ సారాభాయ్. ఉట్టి కలలు కనడమే కాదు, కలల్ని నిజం చేయడానికి పథకాలు వేసినవారు. భారత ప్రభుత్వానికి తన ప్రణాళికలు సమర్పించి, ఒప్పించి 1962లో ఇండియన్ నేషనల్ కమిటి ఫర్ స్పేస్ రీసర్చ్ (INCOSPAR) రూపొం దడానికి కారణమైన వారు. దానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వారు. ఏడేళ్ళ తర్వాత 1969లో దాని పేరు మార్చి, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (19)గా రూపుదిద్దినవారు. దానికి మళ్ళీ సలహాదారుగా, వెన్నుదన్నుగా నిలబడినవారు అన్నీ విక్రమ్ సారాభాయే! అటువంటి వాణ్ణి ప్రపంచం “భారతీయ అంత రిక్ష అధ్యయనానికి పితామహుడి”గా గుర్తిం చుకుంది. ఈ దేశం పద్మ భూషణ్ (1966), పద్మ విభూషణ్ (1972) ఇచ్చి గౌరవించు కుంది. ఆ సమయంలో వైజ్ఞానిక స్పృహగల దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉండడం… విక్రమ్ సారాభాయ్, హోమి జె. బాబా లాంటి ఎంతోమంది శాస్త్రవే త్తలకు స్ఫూర్తి దాయకమైంది. నెహ్రూ గొప్ప దార్శనికుడు గనక, ఆయన తన కాలంలోనే దాదాపు అన్ని జాతీయ పరిశోధనా సంస్థలు ప్రారంభించారు.
విక్రమ్ సారాభాయ్ దేశంలోనే మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళ
<ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్>
లోని తుంబా గ్రామంలో కొబ్బరి చెట్ల మధ్య ఏర్పాటు చేశారు. ఆ గ్రామం తిరువనంతపురం విమానాశ్రమానికి దగ్గరగా ఉంది.
అక్కడే దగ్గర్లో ఉన్న సెంట్ మేరీ మగడెలినేస్ చర్చిని తమ ముఖ్య కార్యాలయంగా చేసుకున్నారు. శాస్త్రవేత్తలంతా అక్కడి నుండే పనిచేసేవారు.
ఆ పక్కన ఉన్న బిషప్ ఇంటిని వర్క్షాపుగా మార్చేశా రు. దానికి ఆనుకుని ఉన్న పశువుల కొట్టం ప్రయోగశాల అయ్యింది.
ఆ ప్రయోగశాలలో యువ ఎపిజె అబ్దుల్ కలాం కూడా పనిచేశారు. తర్వాత కాలంలో నెల్లూరు దగ్గర శ్రీహరి కోటలో
ఇస్రో కేంద్రం అభి వృద్ధి చెంది, ఘన విజయాలు సాధిస్తున్న విషయం అందరికీ తెలి సిందే. మారిన ఇప్పటి పరిస్థితుల్లో ప్రార్ధనా స్థలాన్ని
వైజ్ఞానిక ప్రయో గశాలగా మార్చడం ఎవరికైనా సాధ్యమవుతుందా? మరి ఆరోజుల్లో విక్రమ్ సారాభాయ్ చేసి చూపారు. వైజ్ఞానిక ప్రగతి ముఖ్యం!
అది సమాజానికి పనికొస్తుంది. అందరినీ కలుపుతుంది. మత విశ్వాసాలది ఆ తర్వాతి స్థానం. అవి వ్యక్తిగతం. వేరు వేరు మతాలు,
వేరు వేరు విశ్వాసాలు, అవి జనాన్ని విడదీసేవి.
12, ఆగష్టు 1919న విక్రమ్ సారాభాయ్ ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్ అహ్మదాబాదులో పెద్ద వ్యాపారస్తుడు.
విక్రమ్ తల్లిదండ్రులు ప్రారంభించిన రిట్రీట్ స్కూల్లోనే చదివి, ఆ తర్వాత అహ్మదాబాదు కళాశాలలో భౌతిక శాస్త్రం చదివాడు.
కాదలుచుకుంటే ఆయన దేశంలో పెద్ద పారి శ్రామిక వేత్త కాగలిగేవాడు. కుటుంబమే పెద్ద పారిశ్రామిక కుటుంబం. పైగా, స్వాతంత్ర్య
సమరంలో చురుకుగా పాల్గొన్న కుటుంబం. కానీ, యువ సారాభాయ్ అభిరుచి గణితం, భౌతిక శాస్త్రాలపై ఉండేది.
అందుకే ఇంగ్లాండు వెళ్ళి 1937లో సెయింట్ జోన్స్ కళాశాలలో ఆ విషయాలతోనే మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.
ఇరవై నాలుగవ ఏట, చిన్న వయసులో కేంబ్రిడ్జి నుండి డాక్టరేట్ తీసు కుని స్వదేశం తిరిగొచ్చారు..
1943లో విక్రమ్ సారాభాయ్ తన ఇరవై నాలుగో ఏట, కాశ్మీర్ హిమాలయాల మీదికి వెళ్ళారు.
ఎత్త యిన ప్రదేశాలలో (HIGH ALTITUDE) సూర్య కిరణాల (CosAMIC RAYS) ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధన చేయాలన్నది ఆయన ఆశయం. ఎంతో ఉత్సాహంగా ఉద్వేగభరితంగా సాగిన ఆ అధ్య యనం, ఆయనలో ఒక కొత్త కోరికకు బీజం వేసింది.
సూర్యకిరణా లపై పరిశోధన కోసం ప్రత్యేకించి ఒక ప్రయోగశాలను నెలకొల్పా లని ఆయనకు అనిపించింది.
1939లో రెండవ ప్రపంచ యుధ్ధం మొదలయ్యాక, విక్రమ్ సారాభాయ్ బెంగుళూరులోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరారు. అప్పుడు అది ప్రసిద్ధ శాస్త్రవేత్త సి.వి. రామన్ నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. రామన్ సహచర్యంలో సారాభాయ్ అనేక విషయాలు గ్రహించి, బాగా రాణించారు.
కాస్మిక్ కిరణాలపై ప్రారంభించిన ఆయన పరిశోధనలకు హోమి జె బాబా
కూడా తన సహాయ సహకారాలు అందించారు.
ఆ తరువాత సారాభాయ్ అహ్మదాబాదులో ఫిజికల్ రీసర్స్ లెబో రేటరీ ప్రారంభించారు.
దాంతో అంతరిక్షానికి, కాస్మిక్ రేస్ కి సంబం ధించిన పరిశోధనలు దేశంలో ప్రారంభమయ్యాయి. 1955లో కాశ్మీ ర్లోని గుల్మార్గ్ ఆ సంస్థకు సంబంధించిన మరో శాఖను ప్రారం భించినప్పుడు దానిని అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు.
దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
ఫిజికల్ రీసర్చ్ లాబొరెటరీ, ఇస్రోలే కాక, ఆయన మరికొన్ని సంస్థలకు కూడా రూపకల్పన చేశారు.
టెక్స్ టైల్ పరిశ్రమను ఆధునీకరించేందుకు ఓ సంస్థ – అతిర; యాజ మాన్య నైపుణ్యాన్ని పెంపొందించేందుకు – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ; విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యానికి ఓ సంస్థ: హైదరాబా దులో ఇసిఐయల్; జార్ఖండ్లో యురేనియం కార్పొరేషన్ మొదలైన వన్నీ ఆయన పథకం ప్రకారమే వెలుగు చూశాయి.
హోమి జె బాబా మరణానంతరం అణుపరిశోధనా సంస్థ బాధ్యతలు కూడా సారా భాయ్ నిర్వహించారు.
అణుపరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశోధనారంగంలో మనదేశం ముందంజ వేసిందంటే అందుకు కారణం

అణుపరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశోధనారంగంలో మనదేశం ముందంజ వేసిందంటే అందుకు కారణం హోమి. జె. బాబా – విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ! టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్
నెలకొల్పి దేశాన్ని అణు పరిశోధనారంగం వైపు మరల్చింది హోమి జె బాబా అయితే, ఫిజికల్ రీసర్చ్ లాబొరే టరీ నెలకొల్పి దేశాన్ని
అంతరిక్ష పరిశోధనవైపు మరల్చింది విక్రమ్ సారాభాయ్. దేశానికి అత్యత్తమ వైజ్ఞానిక సేవలందించడంలో
వీరిద్ద రికీ కొన్ని పోలికలున్నాయి.
విక్రం సారాభాయ్ (12 ఆగష్టు 1919 – 30 డిసెంబర్ 1971) భార్య మృణాళినీ సారాభాయ్ ( 11 మే 1918 – 21 జనవరి 2016) ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నర్తకి.
ఆమె కేరళ/ తమిళనాడు లో పుట్టారు. బాల్యం స్విట్జర్లాండ్లో గడిపారు. పాశ్చాత్య నృత్యం అభ్యసించారు. వారిది కూడా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ మే. తండ్రి సుబ్బరామ స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో లాయరు.
తల్లి అమ్ము స్వామినాథన్ స్త్రీ హక్కుల నేత. లోక్సభలోనూ, రాజ్యసభలోనూ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. మృణాళినీ సారాభాయ్ అక్క లక్ష్మి, సుభాస్ చంద్రబోస్ ఆర్మీలో మహిళా రెజిమెం ట్కు సారధ్యం వహించిన కెప్టెన్ ! కెప్టెన్ లక్ష్మిగా ప్రసిద్ధురాలు.
ఈ ఇద్దకు అక్కాచెళ్ళెళ్ళూ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మ భూషణ్ లు స్వీక రించారు.
మృణాళిని విక్రమ్ సారాభాయ్ దంప
తుల కూతురే నర్తకి, నటి, సామాజిక కార్యకర్త ప్రారంభించారు. అలాగే కొడైకెనాల్, తిరువనంతపురాలలో కూడా మల్లికా సారాభాయ్.
కొడుకు కార్తికేయ సారాభాయ్ పర్యావరణ పరి వెంటవెంటనే సారాభాయ్ శాఖలు ప్రారంభించారు.
విక్రమ్. ఎ. సారాభాయే! అయితే ఆయన చేసిన కృషి – ఫలితాలు ఊటీలో టెన్నిస్ ఆడుతుండగా చూసి, ఆయనలోని క్రీడా నైపుణ్యా నిచ్చే సమయానికి ఆయన లేకుండా పోయారు. భారతదేశం ప్రయో నికి, స్ఫూర్తికి ముచ్చట పడ్డారు.
తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరి గించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివి గింది.
తను చేయదలుచుకున్న కార్యక్రమా లు చాలా ఉన్నాయని జన్ ఎక్స్పరిమింట్ (సైట్)- రెండూ ఆయన మరణానంతరం ఉప అందువల్ల పెండ్లి చేసుకోబోవడం లేదని చెప్పిన విక్రమ్, ఆరునెలల యోగంలోకి వచ్చాయి. తుంబా రాకెట్ ప్రయోగశాల నుండి ఆ ఉప తర్వాత ఆమెతో పెండ్లికి ఒప్పుకున్నారు.
గ్రహం ప్రయోగింపబడి వివిధస్థాయిలలో దూరదర్శన్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారంకావడం మనకు తెలుసు.

1975–76లలో SITE తొలి దశలో 2,400 భారతీయ గ్రామాలలోని ఐదు మిలియన్ల ప్రజానీకానికి విద్యా
ఈ రోజు దేశంలో కేబుల్ కనెక్షన్తో టెలివిజన్ లేని ఇల్లు ఉండదేమో. దేశ ప్రజలకు కేబుల్ టి.వి అందుబాటులోకి రావడానికి కారకుడు కూడా విక్రమ్ సారాభాయే.
ఆయన అమెరికాలోని నాసా పరిశోధనా కేంద్రం సలహా సంప్రదింపులతో సైట్ కి 1975లో రూపకల్పన చేసి నందువల్లే, కేబుల్ టివిద్వారా ఇప్పుడు వందల ఛానళ్ళు చూడగలుగుతున్నాం.
అంతరిక్షరంగానికి సంబంధించి ఎన్ని ప్రయోగాలు చేసినా సారాభాయి తన ధ్యేయాన్ని మరవలేదు.
సూర్యకిరణాలపై తాను చేయదలచిన పరిశోధన కొనసాగిస్తూనే వచ్చారు
కాస్మిక్ రేస్ సూర్యకిరణాలు) అంతరిక్షం నుండి భూమిపైకి ప్రసరించే ఒక శక్తి ప్రవాహం. ఇవి సూర్యునితోనూ, పర్యావరణంతోనూ, అయస్కాంత శక్తితోనూ ప్రభావం చెందుతూ ఉంటాయి. అంతేకాదు కిరణాలు గ్రహాల మధ్య ప్రసరిస్తున్నప్పుడు కూడా అవి మరింత ప్రభావానికి లోనవుతాయి. సూర్య కిరణాలపై జరిపే పరిశోధనల మూలంగానే పర్యావరణాన్ని గురించి, భూ అయస్కాంత స్థితి గురించి, సూర్యుడి నైజం గురించి, విశ్వాంతరాళం గురించి అనేక విశేషాలు బయట పడతాయని సారాభాయ్ చిన్న వయసులోనే ఊహించారు.
పరిశోధన కేరళలో పుట్టిన మృణాళిని భర్తతోపాటు అహ్మదాబాదులో స్థిర పడి, అక్కడే కన్నుమూశారు. అహ్మదాబాదుకు చెందిన విక్రమ్ సారా భాయ్ కేరళ – కోవలం బీచ్కు దగ్గర్లో కన్నుమూశారు. అయితే ఆరో గ్యంగా ఉన్న శాస్త్రవేత్త 52ఏళ్ళకే అకాలమరణం చెందడం వివాదా స్పదమైంది. కారణాలేవైనా విచారణ జరుగలేదు. సుభాస్ చంద్ర బోస్, లాల్ బహద్దూర్ శాస్త్రీల మరణాలవలె వీరి మరణం గూర్చి కూడా పూర్తి వివరాలు తెలియవు.